భారతదేశాన్ని టీబీ (క్షయరోగం) రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆరోగ్య శాఖ మరొక కీలకమైన అడుగు వేసింది. ఈ క్రమంలో శివరాంపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో సి వై - టీబీ పేరుతో ఓ ఆధునిక పరీక్ష విధానాన్ని శుక్రవారం డా. హ్యూమరా సుల్తానా, ఎస్. టీ. ఎస్ నరేష్ కుమార్, ఎస్. టీ. ఎల్. ఎస్ రహీం కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ హ్యూమరా సుల్తానా మాట్లాడుతూ ఆరోగ్య స్థితిని నిర్ధారించడం ద్వారా సేవల నాణ్యతను పెంపొందించడానికి దోహదపడుతోందన్నారు.