త్వరలో అన్ని రాజకీయ పదవులను భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అన్నారు. కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ ప్రతినిధి దేప భాస్కర్రెడ్డిలు ఆదివారం మహేష్ కుమార్గౌడ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్తో కేఎల్ఆర్, దేప భాస్కర్రెడ్డిలు కాసేపు మాట్లాడారు.