బీఆర్ఎస్ నేతలు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. హరీష్రావును కూడా గతంలో మంత్రిగా కాంగ్రెస్ చేయలేదా.? అని ప్రశ్నించారు. గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు.