తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమం నిర్వహించాలని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణ పై గురువారం అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎస్ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.