ఖమ్మం జిల్లాకు చెందిన ఐలూరి భావన అనే విద్యార్థిని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో శనివారం అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భావన ఆ కళాశాలలో బీటెక్ సీఎస్డీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండానే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కళాశాల వద్దకు చేరుకున్నప్పటికీ, వారిని లోపలికి అనుమతించలేదు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.