షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు వ్యవసాయశాఖ ఏడిఏ రాజారత్నం ఎనలేని సేవలందించారని వ్యవసాయ శాఖ అధికారులు కొనియాడారు. నారాయణపేట జిల్లా అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ)లో డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ గా పదోన్నతి పై వెళుతున్న రాజారత్నం ను వ్యవసాయ అధికారులతో పాటు డీలర్లు ఘనంగా సన్మానించారు. వ్యవసాయ శాఖ ఏడిఏ గా ఆయన రైతులకు అందించిన సేవలను కొనియాడారు.