రాజకీయ దురంధరులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి శనివారం సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో గల మాజీమంత్రి ధర్మపురి శ్రీనివాస్ స్వగృహంలో ఆయన భౌతికకాయానికి ఏపీ మిథున్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.