తనను అక్కున చేర్చుకొని అక్షరం నేర్పిన బడి, తన మేధస్సు పెంచిన అమ్మ ఒడి, విద్యా ప్రగతి వైపు తనను నడిపించిన గుడి, అలాంటి బడికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు, బీఆర్ఎస్ యువనేత మురళీకృష్ణ యాదవ్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని పాలెం పరిధిలోగల వట్టెం నవోదయ పాఠశాలలో రూ. 10 లక్షలు వెచ్చించి బుధవారం స్వాగత తోరణాన్ని నిర్మించారు.