రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి-2025 చట్టంతో రైతుల భూముల హక్కులు భద్రంగా ఉంటాయని, రైతుల మేలు కోసం భూ సమస్యల సత్వర పరిష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వివరించారు. గురువారం షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీ లో స్థానిక ఆర్డిఓ ఎన్ఆర్ సరిత ఆధ్వర్యంలో జరిగిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సుకు కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.