

పాక్ పీఎంఓలో సమావేశం.. ఇస్లామాబాద్లో మోగిన సైరన్లు
భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన పాకిస్థాన్కు మన సైన్యం గట్టి సమాధానం ఇచ్చింది. ఆ దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడింది. ఈ పరిణామాల వేళ పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో సైరన్ల మోత మోగింది. అదే సమయంలో పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండటం గమనార్హం.