పాలమూరు ప్రజలు, షాద్ నగర్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు అభిమానులు అన్ని వర్గాలు అందించిన విజయాన్ని నా గుండెల్లో పెట్టుకుంటానని ఈ విజయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నానని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీతోపాటు స్థానిక కుంట రామిరెడ్డి గార్డెన్ లో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు. డీకే అరుణ ఘనంగా సన్మానించారు.