పాకిస్తాన్తో పోరాటంలో జవాన్ మురళి నాయక్ మృతి పట్ల లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవ రాంబల్ నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం షాద్ నగర్ లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గిరిజన నాయకులు క్యాండిల్ ర్యాలీ చేశారు. మురళి నాయక్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినదించారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మురళి నాయక్ కుటుంబానికి కోట్లాదిమంది భారతీయులు అండగా నిలుస్తారని అన్నారు.