ప్రతి యేటా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం నిర్దవెళ్ళి గ్రామంలో బీఆర్ఎస్ యువనాయకులు వై. రవీందర్ యాదవ్ సహాకారంతో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. క్రీడల పోటీలలో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించారు. గ్రామీణ ప్రాంతా క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆదిశగా ప్రతి క్రీడాకారుడు కృషి చేయాలని కోరారు.