గాంధీ జయంతి పురస్కరించుకుని నందిగామ మండలం కేంద్రంలో గల గాంధీ విగ్రహానికి బుధవారం షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించినట్లు తెలియజేసారు. గాంధీజీ ఆశయాలని అందరూ పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు హరినాద్ రెడ్డి, జంగ నర్శింలు పాల్గొన్నారు.