రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రానికి చెందిన పిట్టల అంజయ్య శనివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీనియర్ జర్నలిస్ట్ గుండ్రాతి రమణ గౌడ్ వెంటనే 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదేవిధంగా కేశంపేట మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి రూ. 5 వేలు, తలసాని పవన్ రెడ్డి రూ. 3 వేలు మృతుని కుటుంబ సభ్యులకు అందజేసి సంతాపం తెలిపారు.