తరతరాలకు తరగని విద్యా ప్రదాత సావిత్రిబాయి పూలే జీవితం, కృషి భారతీయ సమాజంలో సమానత్వం, విద్య, మహిళా హక్కుల కోసం నిలిచిన మైలురాయిగా నిలిచాయని ఏఐఎస్ఎఫ్ షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆకాష్ నాయక్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండల కార్యాలయం ఎదుట సావిత్రిబాయి జయంతిని పురస్కరించుకున్న సందర్భంగా పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.