కుటుంబ కలహాలతో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన షాద్నగర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వికారాబాద్ మండలం చింతలపల్లికి చెందిన శివకుమార్ పట్టణంలోని ఓ హోటల్లో పనిచేస్తూ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కొన్నిరోజుల క్రితం అతడి జాబ్ పోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీంతో తరుచూ భార్యతో గొడవలు రావడంతో మనస్తాపం చెంది షాద్నగర్లో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.