అణచివేతకు గురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే అని షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ కొనియాడారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం జరిగిన మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.