రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముగ్దులయ్యేలా చేసిన కవయిత్రి మొల్ల ఆమె స్వతంత్ర భావాలే మనకు ఆదర్శం కావాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కవయిత్రి మొల్ల విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లాంచనంగా ఆవిష్కరించారు.