షాద్ నగర్ మున్సిపాలిటీలో గురువారం జరిగిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులో పాల్గొన్న పలువురు రైతులు నాయకులు ప్రజలు జిల్లా కలెక్టర్ ను పలు విషయాలు సమస్యలు ప్రస్తావించి పరిష్కార మార్గాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్డీఓ సరిత, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన పాల్గొన్నారు.