షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్లను అదే పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు తన అనుచర్లతో తొలగించినట్లు పార్టీలో ముసలం రేగింది. గురువారం రాత్రి సదరు బ్యానర్లను తొలగించడం పట్ల వివాదం రేగుతుంది. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి వేయించిన బ్యానర్లు అదే పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు తొలగించినట్లు సమాచారం.