ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై గురువారం షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ పార్ధసారథి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరవుతున్నట్లు చెప్పారు. ఉదయం 10గంటలకు నిర్వహించే ఈ అవగాహన సదస్సుకు రైతులు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.