
ఒకే టెస్టులో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా శుభ్మన్ గిల్ రికార్డు
ఒకే టెస్టులో అత్యధిక పరుగులు (346*) చేసిన భారత బ్యాటర్గా శుభ్మన్ గిల్ రికార్డు సృష్టించారు. ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో గిల్ ఈ రికార్డు సాధించారు. ఇంగ్లండ్ జట్టుపై దూకుడుగా ఆడుతూ గిల్ 80* పరుగులతో (100 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. షోయబ్ బషీర్ వేసిన 53 ఓవర్లో గిల్ ఫోర్, సిక్స్ బాది ఈ రికార్డును అందుకున్నారు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గావస్కర్ (344, వెస్టిండీస్పై) ఉండేది. 55 ఓవర్లకు IND స్కోరు 264/4.