మదాసి మాదారీ కురుమల సమస్యల పట్ల మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి శుక్రవారం శాసన మండలిలో ప్రస్తావించడం పట్ల ఆ సంఘం నాయకులు ఎమ్మెల్సీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా షాద్ నగర్ మదాసి మాధారి కురువ సంఘం తాలూకా ప్రదాన కార్యదర్శి కోరే రాజు, మీడియా కన్వినర్ బండ కుమార్ లు మాట్లడుతూ సంఘం సభ్యులందరి తరపున ఎమ్మెల్సీకి ధన్యవాదాలు తెలియజేసినట్లు పేర్కొన్నారు.