రంగారెడ్డి జిలా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ లో మామిడిపండ్ల లారీ శనివారం బోల్తా పడడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో లారీని లేపుతున్నారు. లారీ బోల్తా పడిందని తెలియగానే. సమీపంలోని ప్రజలు పెద్ద సంఖ్యలు ఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడ్డ పండ్ల కోసం ఎగబడ్డారు.