రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూపు-డి చివరి రౌండ్లో రైల్వేస్తో ఢిల్లీ జట్టుకి జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో విరాట్ను చూసేందుకు అనేకమంది అభిమానులు అరుణ్ జైట్లీ మైదానం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో స్టేడియం వద్ద స్వల్ప తోపులాట జరిగింది. స్వల్ప తోపులాట కారణంగా కోహ్లీని చూసేందుకు వచ్చిన కొందరు ఫ్యాన్స్ గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం అందుతోంది.