రాజస్థాన్లోని దౌసాలో నంద్రీ గ్రామంలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. జాగ్రామ్ అనే వ్యక్తి ఓ గర్భిణీపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై హత్య చేశాడు. జరిగిన విషయాన్ని గర్భిణీ ఇంట్లో చెప్పడంతో.. రెచ్చిపోయిన కుటుంబీకులు నిందితుడి ఇంటికి నిప్పుపెట్టి, వాహనాన్ని తగులబెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.