రాజస్థాన్లోని కోటాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఆరుదైన శస్త్ర చికిత్స చేశారు. బూందీ జిల్లా పదంపురకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు 18 నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి వెళ్లి పరీక్షించుకోగా.. అతడి పిత్తాశయంలో పైత్యరసం లేదని, పూర్తిగా రాళ్లతో నిండిపోయిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో వెంటనే 30 నిమిషాల పాటు కష్టపడి ఆపరేషన్ చేయగా.. పిత్తాశయం నుంచి 6,110 రాళ్లను తొలగించినట్లు చెప్పారు.