TG: రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం 3 నెలల రేషన్ను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 62% లబ్ధిదారులకు పంపిణీ పూర్తైందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మిగతా లబ్ధిదారులకు కూడా ఈ నెలాఖరు వరకు తమకు చెందిన రేషన్ షాపుల వద్ద సన్న బియ్యం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.