RBI కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి రెపో రేటు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఇవాళ నిర్వహించిన మీడియా మసావేశంలో ఆయన మాట్లాడారు. రెపో రేటు 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. జీడీపీ వృద్ధిరేటు 6.7 శాతంగా ఉందన్నారు. ఆర్బిఐ ఐదేళ్ల తర్వాత రెపో రేటు తగ్గించింది. హోం లోన్లపై వడ్డీ తగ్గే అవకాశముంది.