ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. మాకు అప్పుడు ఎలాంటి రక్షణ లేదు. మా విధ్వంసం కోరుకుంటున్న ప్రత్యర్థులను నేడు మళ్లీ ఎదుర్కొంటున్నాం. ప్రపంచంలో ఏ నాయకుడు, ఎలాంటి ఒత్తిడి, ఏ అంతర్జాతీయ సంస్థ నిర్ణయమూ మమ్మల్ని మేం రక్షించుకోవడం నుంచి ఆపలేదు’ అని పేర్కొన్నారు.