ఓ పక్క భారత్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్ మరో వైపు తిరుగుబాటును ఎదుర్కొంటోంది. బలోచిస్థాన్ ప్రాంతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) తిరుగుబాటు ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ఒక పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు BLA ప్రకటించింది. ఇప్పటికే 39 చోట్ల మెరుపు దాడులు నిర్వహించామని తెలిపింది. గత రెండు రోజులుగా పాక్ సైన్యంపై బలోచ్ రెబల్స్ వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.