భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రతా కారణాల వల్ల జైసల్మేర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ఎలాంటి అపాయాన్ని అయినా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు.