భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో పంజాబ్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతమైన బఠిడాలో మరోసారి అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో అక్కడి ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గత రెండు రోజులుగా పాక్ తరచూ దాడికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలను ఇళ్లలోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు.