రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల అన్నారు. తప్పు చేసిన వారి పేర్లే రెడ్బుక్లో ఉన్నాయని, అలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్కి రెడ్ బుక్లో తమ పేరు ఉందో లేదో అనే కంగారు ఉందని, యాక్షన్ అయితే అనివార్యమని స్పష్టం చేశారు. రెడ్ బుక్లో రెండో చాప్టర్ కూడా ఓపెన్ అయ్యిందన్నారు.