ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఉన్న విషయం తెలిసిందే. అయితే హర్యానా నుంచి నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం ఢిల్లీ సర్కారు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ 137 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేయాలని తన తీర్పులో ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానాలోని హతినికుండ్ బ్యారేజీ ద్వారా వజీరాబాద్ బ్యారేజీకి చేరాలని కోర్టు పేర్కొన్నది.