ముగ్గురి హత్య కేసులో 25 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న మహేంద్ర హెంబ్రమ్ గురువారం జైలు నుంచి విడుదల అయ్యాడు. ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మత ప్రబోధకుడు గ్రాహం స్టెయిన్స్ను ఆయన ఇద్దరు మైనర్ కుమారులు జీపులో నిద్రిస్తుండగా హెంబ్రమ్ కాల్చి సజీవదహనం చేశాడు. 1999 ఒడిశాలో ఈ ఘటన జరగగా కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించింది.ఈ క్రమంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను సత్ప్రవర్తన కింద జైలు నుంచి విడుదల చేసింది.