నాగర్ కర్నూల్ జిల్లాలోని SLBC టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి రేపటికీ 50 రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. టన్నేల్ లోపల ప్రమాద స్థలం వరకు కన్వేయర్ బెల్ట్, లోకో ట్రైన్ పునరుద్ధరించారు. స్టీల్, బురద, మట్టి, నీళ్లు, రాళ్లను తొలగిస్తున్నారు. టన్నెల్ లోపల 30 మీటర్లు డేంజర్ జోన్ ఉండడంతో సహాయక చర్యలను స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ లోతేటి సమీక్షిస్తున్నారు.