TG: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. గాలి జనార్దన్రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్రెడ్డి, రాజగోపాల్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ.10 లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.