గాలి జనార్దన్‌రెడ్డికి ఊరట.. బెయిల్‌ మంజూరు

74చూసినవారు
గాలి జనార్దన్‌రెడ్డికి ఊరట.. బెయిల్‌ మంజూరు
TG:  ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన పీఏ అలీఖాన్‌, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, రాజగోపాల్‌కు  తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్‌ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ.10 లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్