ఏపీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ గడువు మంగళవారం(నేడు)తో ముగియడంతో సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను జూన్ 3 వరకు పొడిగించింది. ఇప్పటికే విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, చాణక్య, దిలీప్, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్రెడ్డిల రిమాండ్ వచ్చే నెల మూడు వరకు కొనసాగనుంది.