AP: రాష్ట్రంలోని టీడీపీలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం నెలకొంది. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుండటంతో శ్రావణమాసం రాగానే పదవుల పంపకం ఉండనున్నట్లు సమాచారం. తొలి విడతలో దాదాపు 25 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు టాక్. వీటిలో కొన్ని కూటమిలోని బీజేపీ, జనసేనకు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.