కర్ణాటకలోని మంగళూరు తీరంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంటల్లో చిక్కుకున్న సింగపూర్కు చెందిన కంటైనర్ షిప్లో వరుస పేలుళ్లు సంభవించాయి. పలువురు సిబ్బందితో సహా కంటైనర్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఘటనా స్థలంలో నాలుగు నౌకలతో కోస్ట్ గార్డ్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఇప్పటివరకు 18 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మిగతా సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.