HCU భూములపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదంటే కేంద్ర సంస్థలతో రేవంత్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 'ఆనాడు సీబీఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే.. ఈనాడు ఈడీని BJP విచ్చలవిడిగా వాడుతుంది. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతిని తీసుకువచ్చిందే ఇందిరా గాంధీ. రేవంత్ చేస్తున్న లుచ్చా పనులతో ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది' అని విమర్శించారు.