TG: భూభారతి చట్టం అమలులో భాగంగా జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10,956 పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులు గ్రామాలకే వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. అందుకు జూన్ 2లోపు రాష్ట్రంలోని 10,956 గ్రామాలకు ఒక్కో రెవెన్యూ అధికారిని నియమిస్తామని వెల్లడించారు.