TG: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో రాష్ట్ర విద్యా శాఖ MOU చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో విద్య శాఖ చర్యలు చేపట్టింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో అధునాతన ఎడ్ టెక్ సదుపాయాలను అందించనుంది.