అంతర్జాతీయ క్రికెట్కు వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఇన్స్టా వేదికగా నికోలస్ పూరన్కు అభినందనలు తెలిపారు. అతడి భవిష్యత్తు చక్కగా సాగాలని ఆకాంక్షించారు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడిన పూరన్.. ఇటీవల ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ జట్టు ఎంపికకు దూరంగా ఉన్నారు. పూరన్ టీ20 క్రికెట్లో WI తరఫున 106 మ్యాచ్ల్లో 136.39 స్ట్రైక్రేట్తో 2275 పరుగులు చేశారు.