టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నాడు. 'రిషబ్ పంత్ ఫౌండేషన్' (ఆర్పీఎఫ్) ద్వారా పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు పంత్ ట్విట్టర్ 'ఎక్స్' వేదికగా ఒక వీడియోను పోస్టు చేశాడు. కఠిన సమాయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో తనకు ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నట్లు తెలిపాడు. తన వాణిజ్య సంపాదనలో 10 శాతం పేదల కోసం ఆర్పీఎఫ్కి విరాళంగా ఇస్తానని చెప్పాడు.