బిహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంలో ఆర్జేడీ పిటిషన్

2చూసినవారు
బిహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంలో ఆర్జేడీ పిటిషన్
బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బిహార్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓటర్ల జాబితా సవరణపై ఇచ్చిన ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ సవాల్ చేసింది. ఈ అంశంపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కాగా దీనిపై సోమవారం విచారణ ఉండనుంది. మరోవైపు ఈ విషయంపై ఎంపీ మహువా మొయిత్రా సైతం సుప్రీంను ఆశ్రయించారు.

సంబంధిత పోస్ట్