ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మహా కుంభమేళాలో పాల్గొనేందుకు నేపాల్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్తున్న బస్సు మిరాన్పూర్ సక్కా అనే గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.