TG: నల్గొండ జిల్లా కట్టంగూరు శివారులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ బైక్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతులు శాలిగౌరారం మండలం ఊట్కూరు వాసులుగా గుర్తించారు.